7, డిసెంబర్ 2012, శుక్రవారం

లక్ష్మీ నారాయణ కన్నా -పేరడీ పాట

ఈ పాట "నీ పాదము మీద" అంటూ అన్న చెల్లి మీద ఆనాడు నారాయణ మూర్తి సినిమాలో పాడారు నేడు కన్నా లక్ష్మీ నారాయణగారు వాషింగ్టన్ విచ్చేసిన సంధర్భంగా ఆయన గురించి కాసింత విషయం మా స్నేహితుని ద్వారా గ్రహించి ఆ పాటకి పేరడీ గా రాయడం జరిగింది.

 దేశంలో ఉన్న లక్షల మంది నేతల కన్నా..లక్ష్మీ నారాయణ కన్నా గొప్పవారిలో ఒకరని నే విన్నా.. రాజకీయాల్లో రణధీర ఓటమన్నదెరుగని మగధీర మన రంగయ్యగారి కన్న ఈ ..లక్ష్మీ నారాయణ కన్నా.

 పల్లవి :
తెలుగు జాతి నీ చరితను మరువదు లక్ష్మన్నా..
సాటి తెలుగోడి మల్లే చాటి చెప్పుతా లక్ష్మన్నా..
తెలుగు జాతికి వెలుగు నింపుతూ పేదవారి కడుపు నింపుతూ…..”తెలుగు జాతి నీ ”
 చరణం:1
 రంగయ్య గారి కన్న బిడ్డగా కన్నావారి ఇంటి బిడ్డగా..
కాలేజి రోజుల కాలము నుండే కార్మిక శక్తిగా ఎదిగిపోతివి
ఎదుగుతున్న నిన్ను ఓర్వలేక ఓరన్నా…ఎదురు నిల్వలేక ఎనకేటేసిరి లక్ష్మన్నా..
కత్తిపోట్లకు గురి అయ్యావే మా అన్నా…కొన వూపిరితో కోలుకుంటివా ఓ కన్నా…

 పేదవాడి కల్పతరువులా..పెద్దవాడికి కంటగింపులా.
 తెలుగు జాతి నీ చరితను మరువదు లక్ష్మన్నా.. సాటి తెలుగోడి మల్లే చాటి చెప్పుతా లక్ష్మన్నా..

 చరణం:2
పెద్ద నేతవై ఎదిగిన నుండి వృద్ధనేతతో అడ్డంకులెన్నో..
వామన మూర్తిని భక్తిగ కొలిచి వంగవీటి దారిలో నడచి
చమట తడినే సాగు తడిపిన రైతన్నా కన్నా రాకతో కష్టాలన్నీ తీరన్నా
 పాదు పాదుకు ప్రాణంపోసే రైతన్నా పేదల పాలిటి పెన్నిధిరా మన లక్ష్మన్నా
 పేదరైతుకు కల్పతరువులా..పెద్దరౌతుకు కంటగింపులా...
 తెలుగు జాతి నీ చరితను మరువదు లక్ష్మన్నా.. సాటి తెలుగోడి మల్లే చాటి చెప్పుతా లక్ష్మన్నా..

కామెంట్‌లు లేవు: